Tuesday, September 29, 2009
కె.రోశయ్య అనే నేను అదే జరుగుతుంది
అధిష్ఠానం ఆదేశం మేరకే తాను ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని, ఇష్టమైనవారు తనతో కలిసి పనిచేయవచ్చునని, నచ్చని మంత్రులు తన అసెంబ్లీ నుంచి వెళ్లిపోవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య నిస్పష్టంగా చెప్పాడు. ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ పోస్టర్లను చింపివేసిన ఘటన చోటుచేసుకోవడంపై మంత్రులపై రోశయ్య మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలకు వై.ఎస్. జగన్మోహన రెడ్డిని ఏ మాత్రం బాధ్యుడిని చేయొద్దని కోరారు. తండ్రిని పోగొట్టుకున్న శోకంలో ఉన్న జగన్ను మంత్రులు ఇలాంటి విషయాల్లోకి లాగొద్దని ముఖ్యమంత్రి సవినయంగా కోరుకున్నారు యం.యల్.యేలకు మాత్రం రాజీనామ చేశేవారు చెయొచ్చు నాకేం అభ్యంతరం లేదనిచెప్పారు. సోనియా గారి నిర్ణయంతో అందరు ఏకీభవించాలని హై కమాండ్ నిర్ణయం వచ్చే వరకు వేచిఉండాలని చెపుతున్నాడు మెత్తని పలుకులు పలుకుతునే తానే సి.యం అని చెప్పకనే చెపుతున్నాడు ఎంతటి ఆందోళన వచ్చిన జాప్యం చేసి యం.యల్.యేలలోని జగన్ మద్దతుని తగ్గించేవిధంగా పరిణామాలు జరుగుతున్నాయ్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment