Tuesday, September 8, 2009
కసబ్ అత్తరింటికి వచ్చినట్టుంది తప్ప శిక్ష పడినట్టులేదు
ముంబై దాడుల్లో పాల్గొని సజీవంగా పట్టుబడిన పాక్ ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ కొద్ది రోజుల క్రితం మటన్ బిర్యానీ కావాలని ఈ కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎల్ తహిల్యానీని కోరాడు.అదే రీతిలో కసబ్ సోమవారంనాడు బాస్మతి బియ్యంతో వండిన అన్నాన్ని తనకు పెట్టాలని కోరాడు.ప్రస్తుతం అతడు సర్ ఆర్థర్ జైలులో ఉంటున్నాడు.అక్కడే ప్రత్యేక కోర్టు ఈ కేసు విచారణ జరుపుతోంది.బాస్మతి రోజుకో కొత్త కోర్కె అన్నట్టుగా తన కోర్కెలను ఒక్కొక్కటి బయటపెడుతున్నాడనీ, అతడిని ఎన్నిసార్లు మందలించినా పద్దతి మార్చుకోవడం లేదని జైలు సూపరింటెండెంట్ రాజేంద్ర ధామ్నో సోమవారంనాడు విలేఖరులతో చెప్పారు. కొద్ది రోజుల క్రితం జైలులో మటన్ బిర్యానీ పెట్టలేదని అన్నం కంచాన్ని అతడు విసిరి వేశాడనీ,అక్కడున్న సిబ్బందిని తిట్టాడని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. కసబ్ అనుచిత ప్రవర్తన గురించి ఇప్పటికి పెక్కుసార్లు జైలు అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలందరికీ ఒకే రీతిలో ఆహారం సరఫరా చేస్తామనీ, ఈ విషయంలో హెచ్చుతగ్గులు ఉండవని జైలు సూపరింటెండెంట్ అన్నారు. అధికారుల ఫిర్యాదుపై న్యాయమూర్తి ఇంకా స్పందించలేదు.అయితే, కోర్టులో అతడు పదే పదే నవ్వడం, చేష్ఠలకు పాల్పడటం వంటి వాటిపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పదే పదే హెచ్చరించిన సంగతి తెలిసిందే.ఇవన్ని చదువుతుంటే మీకు కొపం వస్తోంద అతనిపై జాలి కలుగుతోంద అని నేను అడగను నాకు మాత్రం కొపమే వస్తోంది మన ప్రభుత్వం కసబ్ ని పట్టు కున్నాట్టు లేదు అతనిని అథిధిగా పిలిచినట్టు ఉంది లేక పోతే కసబ్ తన అత్తరింటికి వచ్చినట్టు మటన్ బిర్యాని చికెన్ బిర్యాని విత్ బాస్మతి అంటు కోరికలు తీర్చమనటం తీర్చకపోతే డ్యూటిలో ఉన్న వారిని తిట్టే లెవల్ దాక ఉందంటే వాడ్ని పిచ్చకొట్టుడు కొట్టాలి.కోర్టు అన్ని కేసులలాగే దీన్ని వాయిదాలు ఇస్తోంది అలాగే వీడు కోరికలు పెంచుతు పోతున్నాడు మనం మన ప్రభుత్వ అసమర్దత ఇంత తేట తెల్లమవుతోంది అందుకే మన ప్రజలు ఇన్ని భాదలు పడుతున్నారు
Subscribe to:
Post Comments (Atom)
Kasab is a diplomatic instrument in India's hands. So he must be Fed and looked after as long as we can. He is a kotta alludu for us.
ReplyDeleteantea antea
ReplyDeleteసుజాత గారు చెప్పింది కరక్టే! అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన చచ్చు బాధ్యత ఒకటి ఇప్పుడు ప్రభుత్వం మెడ మీద కత్తిలా వేలాడుతోంది.ఇప్పట్లో తనకేం ఢోకా లేదని కసబ్ కీ తెల్సిపోయింది. అందుకే అంత ధీమా, అన్ని డిమాండ్లు!
ReplyDelete