Friday, October 9, 2009

చందమామ రావే...జాబిల్లి రావే...కొండెక్కి రావే....అని పాడుకునే రోజులు పోయాయి

చందమామ రావే...జాబిల్లి రావే...కొండెక్కి రావే....అని పాడుకునే రోజులు పోయాయి. ఇప్పుడు అదే చల్లటి వెన్నలనిచ్చే చందమామపై పరిశోధనలపేరుతో దాడులు జరుగుతున్నాయి. జాబిల్లిపై నీరుందని తెలిపిన ఇస్రో శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు అమెరికా ఖగోళశాస్త్రజ్ఞులు శుక్రవారం ఓ రాకెట్టును చంద్రుడిని ఢీకొట్టేందుకు పంపించారు. ఇది చంద్రుడిని ఢీ కొట్టింది. దీంతో దుమ్ము, ధూళి పెద్ద ఎత్తున ఎగిసిపడింది. అక్కడ నీరున్న ఆనవాళ్లు తెలిసినప్పటినుంచి వాటి లోతుపాతులు తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతరిక్ష శాస్త్రవేత్తలను వేధిస్తూనే ఉంది. ఆ గుట్టు తెలుసుకునేందుకుగాను అమెరికాలోని అంతరిక్ష పరిశోధనాకేంద్రం నాసా ఈరోజు ఒక రాకెట్‌ని ప్రయోగించింది. నాసా ప్రయోగించిన రాకెట్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఢీకొట్టిందని, దాంతో చందమామపై దుమ్ము, ధూళి భారీగా ఎగసిపడ్డాయని తెలుస్తోంది. చంద్రునిపై నీటిజాడల విషయమై సాగుతున్న పరిశోధనల్లో అత్యంత ఖర్చుతో కూడిన ప్రయోగంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ రాకెట్ ఢీ కొట్టిన సమయంలో అక్కడి చిత్రాలు అంతరిక్ష కేంద్రానికి అందుతాయి. వాటిని పరిశీలిస్తే చందమామ నీటి గుట్టు రట్టయిపోతుంది. అందుకు మరి కొన్ని గంటలు చాలని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

Monday, October 5, 2009

జగన్ పత్రిక ప్రభుత్వ వ్యతిరేకo

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, యువ పారిశ్రామికవేత్త, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన సొంత పత్రిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా పని చేస్తోంది. వైఎస్ తనయుడైన తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేస్తూ వార్తా కథనాలను పుంఖాను పుంఖాలుగా రాస్తున్నట్టు ఆ పత్రికను చదువుతున్న అనేక మంది పాఠకులు చెపుతున్నారు.

తన తండ్రి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వైఎస్ జగన్ ఆ పత్రికను స్థాపించారు. ఈ పత్రిక మార్కెట్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే సర్కులేషన్‌ను పెంచుకోవడమే కాకుండా, కోట్లాది మంది పాఠకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా, తెలుగు పత్రికా రంగాన్ని శాశిస్తూ వచ్చిన "ఆ రెండు పత్రిక"ల యాజమాన్యం గుండెల్లో దడ పుట్టించేలా చేసింది.

ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి వైఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రచారాన్ని ఆ పత్రిక, టీవీ ఇచ్చాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేసి ఓటర్ల మనస్సు మారకుండా చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఖంగుతిన్న జగన్.. తన సొంత పత్రిక ద్వారా కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు రోశయ్య ప్రభుత్వ పనితీరును ఎండగడుతోందని ఆ పత్రికా పాఠకులు అంటున్నారు.
మొత్తం మీద జగన్ పత్రిక ప్రభుత్వ వ్యతిరేక పత్రికగా మారిందనే చెప్పొచ్చు.

Sunday, October 4, 2009

వరద పై మీ స్పందన మీ కామెంట్ రూపంలో

chiru:వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ముఖ్యంగా వరద నీటిలో చిక్కుకున్న బాధితుల ప్రాణాలను కాపాడటంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, అందువల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రరాపా ఐదుగురు సభ్యులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు . వరద ముంపునకు గురైన ప్రాంతాలకు వైద్యo. కర్నూలు, మహబూబ్‌ నగర్ జిల్లాల్లో ప్రజలకు తమవంతు సాయం, సేవలు అందించాల్సిందిగా ప్రరాపా కార్యకర్తలను, అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. తినడానికి తిండిలేక మహబూబ్ నగర్‌లో వందలాది మంది ఆకలితో అలమటిస్తున్నారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. అలాగే, ఈ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని చిరంజీవి డిమాండ్ చేశారు.

jagan:రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు చేయూత నిచ్చేందుకు కాంగ్రెస్ కార్యర్తలు, వైఎస్ జగన్, వైఎస్సార్ అభిమానులు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావాస ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని కోరారు. వరద సహాయక చర్యల్లో పర్యటించాలనే కోరిక ఉందన్నారు. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద ప్రాంతాల పర్యటనకు వెళ్ళి, సహాయక చర్యలకు ఆటంకం కలిగించడం భావ్యం కాదనే ఉద్దేశ్యంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు జగన్ తెలిపారు.

rosaiah:వరద సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు పూర్తి సహాయక సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య పిలుపునిచ్చారు. శ్రీశైలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. వరద పరిస్థితిపై ఆయన ఆదివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, అందువల్ల వరద ప్రమాదం పొంచివుందన్నారు. అయితే, ప్రస్తుతానికి వరద ఉధృతి తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. అయినప్పటికీ, వరద సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న అధికారులకు స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. అధికారుల సూచన మేరకు ప్రమాద ప్రాంతాలను తక్షణం ఖాళీ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఖాళీ చేయని వారిని పోలీసుల సహకారంతో బలవంతంగా అక్కడ నుంచి తరలించాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. వరద నీరు తగ్గిన తర్వాత తిరిగి తమ ఆవాసాలకు వెళ్లాలని, ఇలాంటి వారికి ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తుందని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 7.19 లక్షల క్యూసెక్కుల నీరు ఉందన్నారు. ఎగువ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తే ఈ నీటిమట్ట మరింతగా పెరిగే అవకాశం ఉందని రోశయ్య తెలిపారు. అందువల్ల కరకట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

chandrababu:వరద సహాయ చర్యల్లో నిమగ్నం కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వరద నీటిలో చిక్కుకున్న బాధితులను శక్తిమేరకు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ తమ ప్రాంతాల్లోని వరద బాధితుల సమాచారం సేకరించడం, వెంటనే ఆ సమాచారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లకు చేరవేయాలని కోరారు. అంతేకాకుండా, వరద బాధితులకు స్వచ్ఛందంగా తమ వంతు సాయం అందజేయాలని బాబు సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పోటెత్తిన వరద కారణంగా కర్నూలు జిల్లా పూర్తిగా నీట మునిగిపోగా, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడెక్కడ వరద బాధితులు ఇబ్బందుల్లో ఉన్నారో సమాచారం తెలుసుకొని కంట్రోల్ రూమ్ లకు అందజేస్తే అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు వీలవుతుందన్నారు. అదే సమాచారాన్ని తమకు కూడా పంపిస్తే ప్రభుత్వాన్ని మరింత అప్రమత్తం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వరద ముంపు ముంచుకు వచ్చిన ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన భోజన సౌకర్యం కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.


పెద్ద పెద్ద నాయకులు వారి వారి స్పందన తెలిపారు మీరు మీ స్పందన సహయం తెలియజేయండి

యాదౄచ్చిక ఫోటో

Friday, October 2, 2009

ఈ చిత్రాలపై మీ స్పందన







ఇతను గుర్తున్నాడ ?

Shiney Ahuja
బాలీవుడ్ యాక్టర్ షైనీ అహుజాకి మూడు నెలల జైలు జీవితం తర్వాత ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ లభించింది. తన ఇంట్లో పని చేస్తున్న యువతిపై అత్యాచారం జరిపాడని మూడు నెలల క్రితం అరెస్టయిన అహుజాకి దేశం విడిచిపోరాదనే నిబంధన మీద బెయిల్ మంజూరు చేశారు.
కానీ ఈ అత్యాచార ఆరోపనల్లో నిజం లేదని అహుజా మొదటి నుండీ చెబుతూ వస్తున్నాడు. తాను ఆ యువతి అంగీకారంతోనే సెక్స్ లో పాల్గొన్నానని, డబ్బు కోసం ఇప్పుడు ఇలా నాటకాలు ఆడుతున్నారని ఇంతకు ముందే అంగీకరించాడు. కాగా మూడు నెలలు జైల్లో గడిపిన షైనీ బాగా కృంగిపోయాడని, ఆరోగ్యం కూడా సరిగా లేదని బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన తరపు న్యాయవాది కోరిన సంగతి తెలిసిందే.

Thursday, October 1, 2009

సాక్షి టి.వి.ప్రతినిధి దుందుభిలో ఇరుక్కున్న పిల్లాడి మధ్య సంభాషణ

sakshi tv:మీరెందుకు వెళ్ళారు ? naresh:డ్యాం చూడటానికి వెళ్ళాం సార్

sakshi tv prathinidhi:నరేష్ ఏ ప్రాంతంలో ఉన్నారు? nareash:సార్ నేను బండమీద ఉన్నాను కొంచం భయంగాఉంది. sakshi tv prathinidi:నరేష్ భయపడకండి మీకు సహయక చర్యలు జరుగుతున్నాయి.. నరేష్ ఖచ్చితంగా ఎక్కడున్నారు అంటే మైలురాయి అది చెపితే మిమ్మల్ని కాపాడటానికి కుదురుతుంది!! sakshi tv prathinidhi:మీతో పాటు ఎంతమంది ఉన్నారు? naresh:సార్ 14 మంది ఉన్నాo.పక్క గ్రామలవారు కూడ ఉన్నారు. sakshi tv prathinidhi:మిమ్మల్ని ఎవరైన కాపాడేప్రయత్నం చేస్తున్నారు మికెవరైన కనిపిస్తున్నార? naresh:సార్ అంత షోజరుగుతోంది
కాపాడే ప్రయత్నం చేయట్లేదు.

sakshi tv:నరేష్ మిదగ్గర కాగితం ఎదైనా ఉందా? naresh:లేదు సార్ ఒక సెల్ ఫోన్ మాత్రమే ఉంది మేము ఇప్పడివరకు బానేఉన్నాం.నీటి ప్రవహం పెరుగుతోంది భయంగా ఉంది
అందోళనలో విధ్యార్దుల తల్లి తండ్రులు వరద తగ్గేదాక ఆగి కాపాడదామనుకుంటున్న అధికారులు :విజేందర్ సాక్షి ప్రథినిధి టేంక్యు విజెందర్ మరిన్ని అప్ డేట్స్ తో మళ్ళీ కలుద్దాం ఇప్పటికి బ్రేక్
అంతలో బ్రేకింగ్ న్యూస్:మహబూబ్ నగర్ లో చిక్కుకున్న 15 మంది విధ్యార్ధులు హెలికాఫ్టర్ రేపు పంపుతామని చేతులెత్తేసిన అధికారులు రాజ[ఈ టపా రచయిత]అంటే వారు చనిపోయిన పట్టించుకోరు గాని హెలికాఫ్టర్ రేపు పంపుతారంట అంటే వారి ఇలోపు ఎదేనా అయితే వీరు బాధ్యులు కాద ఇప్పుడు ఎందుకురాదో మరి హెలికాఫ్టర్ మోరాయిస్తోందేమో.

ఎన్నిసినిమాలు వీళ్ళ గురించి తీస్తున్న మారనే మారరు ఈ టి.వి.వాళ్ళు

తనమీద హత్యాప్రయత్నం చేసినవారి గురించి గాంధీ


1948 జనవరి 20న గాడ్సే అతని బృందం గాంధీని హత్యచేయటానికి విఫల ప్రయత్నం ఛేసారు. అందులో వారి అనుచరుడు మదన్ లాల్ అరెస్టయినాడు.ఈ విషయం గాంధీ కు తెలిసిన మీదట, మదన్ లాల్ ను ధైర్యం గల కుర్రాడని మెచ్చుకున్నాడట. ఆయన మాటల్లొనే ఆయన ప్రతిస్పందన- "పిల్లలు!! వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. నేను పొయ్యక గుర్తుకు తెచ్చుకుంటారు, ఆ ముసలాడు సరిగానే చెప్పాడని"

this post by wiki pedia




Wednesday, September 30, 2009

వానమ్మ వానమ్మ ఆగవ

వాన వచ్చి వై.యస్.ని తీసుకుపోయింది మళ్ళి వానోచ్చి పంటలు తీసుకుపోతోంది కావల్సిన వాన కన్న అతిగా పడితే ఎంత భీభత్సమో చూపిస్తోంది అధికారులయిన మనుషులేకాబట్టి వారు మాత్రం ప్రకౄతి నెదిరించి ఏం చేస్తారు సహయం చేయటానికైన వారికి చాల ఇబ్బందులు పరిమిషన్స్ ఉంటాయ్ వారు కూడ వారి చేయగలిగినమేరకు చేస్తున్నారు కావలనుకున్నప్పుడు పడని ఈ వాన ఇపుడు వచ్చి పంటలు నాశనం చేస్తోంది మరి రైతులు ఉరుకున్నా మధ్య వర్తులు ఇదే అదునుగా బొక్కుతారు.

వందలాది ఎకరాలు నీటమునిగింది వై.యస్.చనిపోయినప్పటినుంచి ఈ వాన ఆంధ్రని ఆడుకొంటోంది రెండేరోజులలో రిజర్వాయర్ మునిగేంత నీరు చేరిందంటే చూసుకోండి మరి ఎంత వాన పడిందో 'వానమ్మ వానమ్మ ఆగవమ్మ' లేనిచో నువ్వు నాశనం చేసింది కొంత దళారులు చేసేది మరి కొంత అయి పేదవారు జీవించటమే కష్టమైపోతుంది.

అయినా ఉదౄతంగా ఎందుకు ఇంత వాన అది ఎవరు చెప్పలేరనుకోండి ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రో పక్కన పెట్టి ఈ వరదలపై తగిన చర్యలు తీసుకోవాలి అధికారులార మీ పై అధికారులు పట్టించుకోపోయినా మీకు ఉన్న అధికారం మేరకు సహయం అందించండి.

నేను చెప్పేదేమిటంటే ప్రతి దానికి మంత్రులుదాక వెళ్ళనక్కర్లేదు.హైదరాబాద్ లో హోల్స్ లేకుండా చేయటానికి మంత్రి అక్కర్లేదుగా మీ పరిధిలో మీరు సహయం చేయండి.అ తరువాత మిగిలిన పై అధికారులు వస్తారు.

ఇదంత ఎందుకంటే వై.యస్.చనిపోయినిదానిని ఈ వానలకు ఆపదిస్తు రాస్తున్నాను అప్పుడు ఆలస్యంగా స్పందించారు మహనాయకుడు చనిపోయాడు.ఇప్పుడు ఈ వరద ఆపటానికి కాకపోయిన దాని నష్టనయినా ఎదుర్కొండి ఇప్పటికే 100 ఎకరాలు నాశనమయ్యాయి మిగిలినవయిన పోకుండా చూడండి డాక్టర్లు మీరు కూడ స్పందించండి స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న ఈ తరుణంలో విష జ్వరాలకు తగిన చర్యలు తీసుకోండి లేక పోతే మరికొన్ని మరణాలు

ఎవరు వచ్చిన రాకపోయిన సామన్య జనమయిన మీ మేరకు మీరే సహయం అందించుకోండి.


హై కమాండ్ కింక ఏమి కావలండి

హై కమాండ్ కింక ఏమి కావలండి జగన్ కన్నా మంచి వాడు ఎవడు దొరుకుతాడు అందరు జగన్ కావాలని కోరుకుంటుంటే ఇంకా రోశయ్య ని ఉంచటంలో అర్దం ఏమిటి రోశయ్య ఎలాగు సమర్దవంతుడే అయినప్పటికి యువకుడు కాదు రాజీవ్ గాంధి యువరాజ్యం కావలంటు 2014కల్ల ప్రధాని అవాలని భావిస్తుంటే ఆంధ్ర లో జగన్ కొడుకు ఎందుకాకుడదు అది నా ప్రశ్న అంతే మీ కామెంట్లు ???

Tuesday, September 29, 2009

ఇలాంటి వనితలను చూసి మనవాళ్ళూ నేర్చుకోవాలి

జమ్ము: ఉగ్రవాదులకు వ్యతిరేకించడంలో జమ్మూ బాలిక అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించింది. తనను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను రుక్సానా కౌసర్ ఎంతో ధైర్యంతో ఎదుర్కుంది. తనను ఎత్తుకుపోవడానికి వచ్చిన ఆరుగురిలో ఒక ఉగ్రవాది నుంచి ఎకె - 47 లాక్కుని వారిని ఎదిరించింది. ఆమె జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. మిగతా వారు కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు.

ఆమెకు గ్రామ రక్షణ కమిటీ ఇచ్చిన శిక్షణ ఇందుకు ఉపయోగపడింది. కలస్నికోవ్ ఆసాల్ట్ రైఫిల్ ను ఎలా వాడాలనే విషయంపై ఆమె గ్రామ రక్షణ కమిటీ నుంచి శిక్షణ పొందింది. ఉగ్రవాదిని గోడకు అదిమిపట్టానని, ఆ తర్వాత రైఫిల్ గన్ బట్ తో కొట్టానని, ఆ తర్వాత పలు మార్లు కాల్పులు జరిపానని రుక్సానా చెప్పింది.




చందమామ శంకర్ గారి జీవితవివరాలు





కె.రోశయ్య అనే నేను అదే జరుగుతుంది

అధిష్ఠానం ఆదేశం మేరకే తాను ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని, ఇష్టమైనవారు తనతో కలిసి పనిచేయవచ్చునని, నచ్చని మంత్రులు తన అసెంబ్లీ నుంచి వెళ్లిపోవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య నిస్పష్టంగా చెప్పాడు. ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ పోస్టర్లను చింపివేసిన ఘటన చోటుచేసుకోవడంపై మంత్రులపై రోశయ్య మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలకు వై.ఎస్. జగన్మోహన రెడ్డిని ఏ మాత్రం బాధ్యుడిని చేయొద్దని కోరారు. తండ్రిని పోగొట్టుకున్న శోకంలో ఉన్న జగన్‌ను మంత్రులు ఇలాంటి విషయాల్లోకి లాగొద్దని ముఖ్యమంత్రి సవినయంగా కోరుకున్నారు యం.యల్.యేలకు మాత్రం రాజీనామ చేశేవారు చెయొచ్చు నాకేం అభ్యంతరం లేదనిచెప్పారు. సోనియా గారి నిర్ణయంతో అందరు ఏకీభవించాలని హై కమాండ్ నిర్ణయం వచ్చే వరకు వేచిఉండాలని చెపుతున్నాడు మెత్తని పలుకులు పలుకుతునే తానే సి.యం అని చెప్పకనే చెపుతున్నాడు ఎంతటి ఆందోళన వచ్చిన జాప్యం చేసి యం.యల్.యేలలోని జగన్ మద్దతుని తగ్గించేవిధంగా పరిణామాలు జరుగుతున్నాయ్.

Sunday, September 27, 2009

రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చురగిలింది

రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చురగిలింది. కాంగ్రెస్ వర్గాల్లో ఈ మార్పులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఒకవైపు జగన్ అనుకూలురు, మరో వైపు జగన్ వ్యతిరేకులు.... ఇరు శిబిరాల మధ్య వర్గపోరాటం మొదలైంది. సోనియా ఫ్లెక్సీ చించివేయడం, బస్సులకు నిప్పంటించటం, పార్టీ కార్యాలయాలకు తాళాలు వేయడం వంటి పరిణామాలతో... రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటిదాకా జగన్ కు పరిస్థితి అనుకూలంగా ఉందనే ఏకపక్ష భావన చెదిరిపోయింది. వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న వారి సంఖ్య పెరిగింది. నిన్న మొన్నటి వరకూ నోరుమెదపని వారూ ఇప్పుడు తెరముందుకు వస్తున్నారు. ఒక్కొక్కరుగా ఒక్కటవుతున్నారు. అధిష్ఠానం అందిస్తున్న అండదండలతో విజృంభిస్తున్నారు. వీరందరి చేతిలో...సోనియా బొమ్మ ప్రధాన అస్త్రంగా మారింది. తాజా పరిణామాలతో జగన్ వర్గం ఆత్మరక్షణలో పడింది. సోనియా ఫ్లెక్సీ చించివేతపై జగన్ స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. జగన్ ను సీఎం చేయాలంటూ కార్యకర్తలు సోనియా ఫొటోను చించివేయడంపై ఆవేదన, ఆగ్రహం, ఆక్రోశం కలగలసిన స్వరాలతో... సోనియా ఫొటోనే చించేస్తారా? వైఎస్సే సర్వస్వమనుకుంటున్నారా? సోనియా లేకుండా ఆయన గెలిచేవారా? సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు... పార్టీలో ఉండటానికి అనర్హులు. బయటికి వెళ్లిపోండి అంటూ హెచ్చరికలు జగన్ చేయాల్సి వచ్చింది.
పార్టీ నేతలు కాకా, కేకే, వీహెచ్, హర్షకుమార్, మధు యాష్కీ, రేణుకా చౌదరి తదితర నేతలు ఒక్కసారిగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ చీఫ్ డీఎస్ లు సైతం ఆగ్రహించారు.ఇరువురూ దీనిపై చర్చించుకున్నారు. అధిష్ఠానం కూడా తీవ్రంగా స్పందించింది. జగన్ తో కేవీపీ రామచంద్రరావు బెంగుళూరులో మంతనాలు జరిపారు. ఆయన ఢిల్లీ నుంచి ఒక కవరు రావడంతో బెంగుళూరుకు వెళ్లినట్లు చెప్పారు. తాజా పరిణామాలతో జగన్ వర్గంపై అధిష్ఠానం ఆగ్రహం మరింత పెరిగింది. శరణు వేడితే తప్ప జగన్ కు సోనియా కటాక్షం లభించదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ చీలికకు ప్రయత్నాలు సాగుతున్నాయేమోనని అధిష్ఠానం అనుమానిస్తోంది. వరుస సంఘటనలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా విశ్వాసం కలిగించి, అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమనే వైఖరి ప్రదర్శిస్తేనే సోనియాను కలిసే అవకాశం దక్కుతుందనే అభిప్రాయంలో వున్నారు. మరోవైపు... రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి అయ్యేదాకా తన ప్రయత్నాలను కొనసాగించి తీరాలని జగన్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ రెండో తేదీ తర్వాత 'ఓదార్పు' పేరిట ఆయన జిల్లాల్లో పర్యటించాలని యోచిస్తున్నారు. అందులోనూ... తండ్రిలాగే 'చేవెళ్ల సెంటిమెంట్' పాటిస్తూ అక్కడినుంచే తన పర్యటనలు మొదలుపెట్టనున్నారు.


ప్రత్యేకమైన పెండ్లి

దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి ఒకేసారి నలుగురు మహిళలను పెండ్లాడాడు. పెండ్లి వేడుకల్లో పెండ్లి కూతురులకు ప్రతి ఒక్కరికి ఉంగరం తొడిగి ముద్దాడాడు. ఈ పెండ్లి సందడిలో వేలాదిమంది పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.

దక్షిణాఫ్రికాలోని వీనేన్‌లో శనివారం ప్రత్యేకమైన పెండ్లి జరిగింది. అందులో పెండ్లి కుమారుడైన మిల్టన్ మ్బ్లే (44) ఏకంగా నలుగురు మహిళలను పెండ్లాడాడు. ఈ పెండ్లిలో భాగంగా అతను పెళ్ళి చేసుకున్న ప్రతి మహిళకు ఉంగరం తొడిగి ముద్దాడాడు. దీంతో పెండ్లి తంతు ముగిసిందని మత పెద్దలు ప్రకటించారు.

దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన చట్టం బహూ భార్యాత్వాన్ని సమర్థిస్తుంది. దీనికి ఉదాహరణగా అక్కడి అధ్యక్షుడు జుమాకు ముగ్గురు భార్యలుండటం గమనార్హం.

ఇదిలావుండగా ఇదివరకే ఇతనికి 11 మంది పిల్లలున్నట్లు సమాచారం.

శిఖరాగ్ర సమావేశాల్లో భారతదేశం

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న తర్వాత భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారంనాడు స్వదేశానికి తిరిగి వచ్చారు.

శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రపంచంలోని అగ్రదేశాలతోపాటు ఇతర ప్రధాన దేశాలు మాంద్యంతో అతలాకుతలమౌతున్న దేశాలకు ప్రత్యేక ప్యాకేజీలు అవసరమని తీర్మానించాయని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.

ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో భారతదేశం చేటు సంపాదించుకుందని శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.

తన నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం పిట్స్‌బర్గ్ వెళ్ళిన ప్రధాని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా నేతృత్వంలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

Saturday, September 26, 2009

నేనే ముఖ్యమంత్రి:రోశయ్య

ముఖ్యమంత్రి కె.రోశయ్య కుండ బద్దలు కొట్టారు. తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తరుచూ ముఖ్యమంత్రులను మార్చబోరని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తద్వారా తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రిగా ఒకరికి అవకాశం ఇచ్చి తగిన సమయం ఇస్తారని, సమర్థత నిరూపించుకోకపోతే అప్పుడు ఆలోచిస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఇచ్చినట్లేనా అని ప్రశ్నించగా తాను వచ్చి నెలే అయిందని చమత్కరించారు. అప్పుడే తాను అసమర్థుడినో, సమర్థుడినో చెప్పేది ఎలా అని ఆయన ప్రశ్నించారు. మీ వృత్తిలో లాగే తాను ఎడిటర్ ప్రమోషన్ ఇప్పుడే పొందానని ఆయన అన్నారు. మీ ఎడిటర్ పోస్టు తాత్కాలికమా, శాశ్వతమా అని అడిగితే ఎడిటర్ పోస్టు శాశ్వతంగా ఉండదని అన్నారు. జగన్ ను సిఎం చేయాలని కోరడంలో తనకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన అన్నారు. జగన్ సహజ నాయకత్వ లక్షణాలున్న నేత అని ఆయన అన్నారు.

తాను బలహీనుడ్ని, తన పరిపాలన బలహీనం కాదని ఆయన స్పష్టం చేశారు. తన బలమేమిటో తనకు ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన కెవిపి రామచందర్ రావు గురించి తాను ఇది వరకే చెప్పానని ఆయన అన్నారు. మళ్లీ చెప్పడానికేమీ లేదని ఆయన అన్నారు. కెవిపి రాజ్యసభ సభ్యుడు అని, పార్టీలో కీలక నేత అని, కెవిపికి ఉన్న ప్రాముఖ్యం, గౌరవం కెవిపికి ఉన్నాయని ఆయన అన్నారు. కష్టమైనా, క్లిష్టమైనా వైయస్ రాజశేఖర
రెడ్డి [^] కార్యక్రమాలను ముందు తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. వైయస్ రాష్ట్రంలో, పార్టీలో ఓ వెలితి ఏర్పడిందని ఆయన అన్నారు. దీన్ని అధిగమించాల్సి ఉందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ సేవలను తప్పకుండా ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. జగన్ ఉత్సాహవంతుడు, యువకుడు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడు, ఆయన సేవలు ఎలా ఉపయోగించుకోవాలో అధిష్ఠానం చూసుకుంటుందని రోశయ్య అన్నారు. తాను ప్రకటనలు ఇవ్వకుండగా అవసరం వచ్చినప్పుడు అధిష్ఠానానికే వివరిస్తానని ఆయన చెప్పారు. డిజిపి, ప్రధాన కార్యదర్శుల మార్పు ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు.




Friday, September 25, 2009

నల్ల కాల్వలో జగన్ ప్రసంగం

జనసముద్రాన్ని తలపిస్తున్న పావురాల గుట్ట కి నేడు జగన్ తన తండ్రికి నివాళులు అర్పించడానికి వెళ్ళాడు. దానితో రాష్టంలోని ప్రతి ఒక్కరు జగన్ చూడలనే ఉద్దేశంతో పావురాల గుట్టకి చేరుకున్నారు

అదంతా చూస్తుంటే "జనం కోసం జగన్ జగన్ కోసం జనం అనే పదం నిజమనే విధంగా జనసంద్రంతో నిండిపోయింది జగన్ వచ్చి రాగానే జగన్ సి.యం కావలంటు నినాదాలతో మారుమోగిపోయింది ఎక్కడెక్కడినుంచో వచ్చిన వారు పరి పరి విధాల వారికి తోచిన విధంగా పాటలతో శ్రద్దాంజలి ఘటిస్తున్నారు వారందరితో పాటు అక్కడికి చేరుకున్న జగన్ శ్రద్దాంజలి ఘటించాడు సర్వమత ప్రార్ధనలు చేశాడు.

అటునుంచి వై.యస్.హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు.
అక్కడినుంచి బహిరంగ సభకి వెళ్ళాడు లక్షలాది జనంతో నిండిపోయింది నల్లకాల్వ అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న జగన్ అతనితో పాటు కొంతమంది నాయకులు సర్వమత ప్రార్ధనలు జరిపారు. అందులో జగన్ని సి.యం.కావలని ప్రార్ధనలొ సర్వమత ప్రార్ధనపండితులు,పాస్టర్లు,నమాజు చేసినవారు చెప్పారు

జగన్ ప్రసంగం: వై.యస్.అభిమానులార,అక్కలార,చెల్లెలరా,తమ్ములార,అన్నలార నన్ను ఓదర్చడానికొచ్చిన మీకందరికి నా నమ:సుమాంజలి

సోదరులార మిత్రులార అక్కలార చెల్లెలార రెండుచేతులు జోడించి నా ధన్యవాదలు తెలుపుతున్నాను పుట్టెడు దు:ఖంలోఉన్న మీఆదరణ చూపారు రాష్టం నలుమూలలనుంచి వచ్చిన మీరందరికీ నా ధన్యవాదలు తెలుపుతున్నాను

ఈ రోజు పావురల గుట్టకి వెళ్ళాను అక్కడ నాన్న చనిపోయిన ప్రదేశాన్ని చూశాను.పావురాలగుట్ట పేరు గుర్తొస్తుంటే ప్రియతమనాయకుడు నాన్న గుర్తుకొస్తాడు ఇదంతా ఒక పీడకలయితే బాగుండనిపించింది. పావురాలగుట్ట గుర్తుకొచ్చినప్పుడల్ల ఆ ప్రయాణం వాయిదాపడితే బాగుండనిపిస్తోంది.

చనిపోయిన మహనాయకుడు నా తండ్రిగారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు.నాకు అంతటి ఆదరణ కలిగించారు గనకనే మీరందరికి నమ:సుమాంజలి తెలుపుతున్నాను.ఆ గొప్ప నాయకుడు మనందరి జీవితాలు ప్రభావితం చేశాడు నాన్నగారు చనిపోలేదు మీఅందరి చిరునవ్వులో ఉన్నాడు ఆయన ఆప్యాతతో ఆదరణతో లక్షలాది చేతులు మీరిచ్చిన కొండoతబలం మీరిచ్చారు గనకే ఈ రోజు ఈమైక్ పట్టుకొని మీకందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను లక్షలాదిమంది ఓదారుస్తున్నారు ఇదంతా చూస్తుంటే బహుశ నాన్నే అదైర్యపడకు అన్నట్టుంది నేను వై.యస్ గారిని చనిపోనివ్వాను మీఅందరి చిరునవ్వులో చూపిస్తాను అందరం అతని ఆశయాలు నెరవేర్చి అందరిలోను మహనాయకుడ్ని బతికిస్తా.

బతికున్న రోజులలో అనేవాడు గల గల పారుతున్న గోదావరి జల జల పారే కృష్ణమ్మతో కలుపుదాం రాష్ఠంలోని ప్రతి ఎకరం నీరుతో నింపుదాం ప్రతి రైతులో చిరునవ్వు చూద్దం ఆంధ్ర రాష్టంలోని ప్రతి యువకుడు పెద్దచదువులు చదువుకునే విధంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆంధ్ర రాష్టంలోని ప్రతి మహిళ లక్షధికారి కావాలని అవన్ని నెరవేరుద్దం వై.యస్ .గారిని బ్రతికించుకుందాం

ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి ధన్యవాదలు.

ఇప్పటివరకు వై.యస్.గారి గురించి 650మంది చనిపోయారు వారిలో కొందరు ఆత్మహత్యచేసుకున్నారు వారందరిని నేను కలుస్తాను వారందరి కుటుంబాలకు న్యాయం చేస్తాను వారందరికి ప్రగడ సానుభూతి తెలుపుతున్నాను.

జై హింద్ జై.రాజశేఖర రెడ్డి,అమర్ రహే వై.యస్.ఆర్